ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ABN , First Publish Date - 2021-11-25T06:39:05+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
కోలవెన్నులో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ సతీష్‌

కోలవెన్ను (కంకిపాడు), నవంబరు 24 : రైతులు పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని కోలవెన్నులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటనష్టం జరిగిందన్నారు. పంట నష్ట వివరా లను సేకరిస్తున్నామన్నారు. అదే విధంగా ఽమండలంలోని తెన్నేరులో రైతుల నుంచి సేకరించిన దాన్యాన్ని మిల్లుకు జెండా ఊపి తరలించారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-25T06:39:05+05:30 IST