ధరలు బేరీజు వేసుకోండి.. వైసీపీ బాదుడు తెలుసుకోండి : మాలేపాటి
ABN , First Publish Date - 2022-07-01T03:08:24+05:30 IST
టీడీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలను, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలను బేరీజు వేసుకుంటే వైసీపీ ప్ర
కావలి, జూన్ 30: టీడీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలను, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలను బేరీజు వేసుకుంటే వైసీపీ ప్రభుత్వం సామా న్యులపై ఎంతభారం మోపుతుందో అర్థమవుతుందని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. కావలిలోని పలు వార్డుల్లో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. 13వ వార్డులో జ రిగిన కార్యక్రమంలో సుబ్బానాయుడు పాల్గొన్ని ఇంటింటి ప్రచారం చేట్టారు. పెరిగిన ధరలను తెలియచేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చే దానికన్నా లాక్కునేది ఎక్కువగా ఉందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.