ప్రభుత్వ పథకాలు అందట్లేదని దొంగలు ప్రచారం చేస్తున్నారు: ధర్మాన

ABN , First Publish Date - 2022-04-23T01:01:24+05:30 IST

ప్రభుత్వ పథకాలు అందట్లేదని ఊళ్లల్లో దొంగలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.

ప్రభుత్వ పథకాలు అందట్లేదని దొంగలు ప్రచారం చేస్తున్నారు: ధర్మాన

శ్రీకాకుళం: ప్రభుత్వ పథకాలు అందట్లేదని ఊళ్లల్లో దొంగలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. సున్నావడ్డీ పంపిణీ పథకంలో భాగంగా శ్రీకాకుళంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ‘నిబంధనల ప్రకారం ప్రభుత్వ పథకాలకు అనర్హులైన వారి వద్దకు టీడీపీ నాయకులు వెళ్లి.. వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రభుత్వ పథకం వర్తించలేదా? పింఛన్‌ ఇంతేనా వస్తోంది. ఇళ్లు మంజూరు కాలేదా?. ఇటువంటి దొంగల మాటలు వినొద్దు’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. ఎటువంటి సిఫారసు లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు మంజూరవుతున్నాయని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

Updated Date - 2022-04-23T01:01:24+05:30 IST