Dharmapuri Aravind : కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని మాట్లాడతారు.. కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్

ABN , First Publish Date - 2022-09-22T20:27:37+05:30 IST

మంత్రి కేటీఆర్ (Minister KTR) - బీజేపీ నేతల జోకర్ ట్వీట్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Nizamabad MP Dharmapuri Aravind) స్పందించారు.

Dharmapuri Aravind : కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని మాట్లాడతారు.. కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్

Delhi : మంత్రి కేటీఆర్ (Minister KTR) - బీజేపీ నేతల జోకర్ ట్వీట్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Nizamabad MP Dharmapuri Aravind) స్పందించారు. కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయన వ్యాఖ్యలను పట్టించుకోబోమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ (Kazipet coach factory)కి భూమి ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతల (BJP Leaders)ను జోకర్లు అనేముందు కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్ (KCR Third Class Broker) అని తెలుసుకోవాలన్నారు. ఇంకా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో హిందువులను చంపడానికి ఉన్న పీఎఫ్ఐ (PFI) సంస్థను కేసీఆర్ ప్రోత్సాహిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత (Kavitha), ఫీనిక్స్ , బిల్డర్స్ స్కాంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారు. 


తెలంగాణ (Telangana)లో హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉన్న టెర్రరిస్ట్ పార్టీ ఎంఐఎం (MIM). కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రచారానికి వెళతారు.. కేటీఆర్, కవిత అరెస్ట్ అవుతారు. జైళ్ల శాఖ మంత్రి.. కేటీఆర్, కవిత కోసం జైలు సిద్ధం చేసుకోవాలి. నాలుగు రోజుల్లో కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో విచారణకు పిలుస్తారు. అదే రోజు అరెస్ట్ చేస్తారు. కేటీఆర్‌కు నార్కోటిక్ పరీక్ష చేయాలి. కేసీఆర్, కేటీఆర్ అవినీతి సొమ్ముకి సంబంధించిన కేసుల్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారు. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తాయి. బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయదు. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయగలిగేది కేటీఆర్ మాత్రమే. కవితను ఓడించడం, జైలుకు పంపడం వెనక కేటీఆరే ఉంటారు’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2022-09-22T20:27:37+05:30 IST