సీఎంఏ పరీక్షలో మెరిసిన ధర్మవరం విద్యార్థి
ABN , First Publish Date - 2022-09-30T04:55:53+05:30 IST
పట్టణంలోని కేశవనగర్కు చెందిన పిన్ను అనిల్ కుమార్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సీఎంఏ (కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఇంటర్) ఫైనల్ పరీక్షల్లో ఆలిండియా 21వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
ధర్మవరం, సెప్టెంబరు 29: పట్టణంలోని కేశవనగర్కు చెందిన పిన్ను అనిల్ కుమార్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సీఎంఏ (కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఇంటర్) ఫైనల్ పరీక్షల్లో ఆలిండియా 21వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. చదువుపై చిన్నప్పటి నుంచి మక్కువ అన్నారు. హార్డ్వర్క్, తల్లిదండ్రులు, స్నేహితులు అందించిన ప్రోత్సాహం వల్ల ఈ ర్యాంక్ను సాధించానన్నారు. సీఎంఏ పైనల్ పరీక్షలో 800 మార్కులకుగాను 494 మార్కులు సాధించానన్నారు. దీంతో అతడిని పట్టణ ప్రముఖులు, స్థానికులు అభినందించారు.