‘అగ్నిపథ్’ను వెంటనే రద్దు చేయాలని ధర్నా
ABN , First Publish Date - 2022-06-28T04:35:17+05:30 IST
కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టి ‘అగ్నిపథ్’ను వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్ర సాద్రావు అన్నారు. కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం అంబేద్కర్చౌక్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సంద ర్భంగా కొక్కిరాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల యువత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.
ఆసిఫాబాద్రూరల్, జూన్ 27: కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టి ‘అగ్నిపథ్’ను వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్ర సాద్రావు అన్నారు. కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం అంబేద్కర్చౌక్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సంద ర్భంగా కొక్కిరాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల యువత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. మూడేళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేక 1.80లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పాత పద్ధతినే కొనసాగించాలని లేనిపక్షంలో కాంగ్రెస్పార్టీ ఆధ్వ ర్యంలో దశల వారీ ఆందోళనలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు గణేష్ రాథోడ్, మహిళాకాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రాజేంద్ర కుమారి, నాయకులు అనీల్గౌడ్, కేశవరావ్, తది తరులు పాల్గొన్నారు.