పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ధర్నా

ABN , First Publish Date - 2021-02-28T05:02:01+05:30 IST

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ధర్నా

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ధర్నా
షాబాద్‌లో ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు

ఆమనగల్లు/షాబాద్‌ : పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆమనగల్లు పట్టణంలో శనివారం యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్రీశైలం- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ కూడలిలో రాజీవ్‌ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో చేసి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ నాయకులు రాపోలు అనిల్‌, కృష్ణనాయక్‌, వస్పుల శ్రీశైలం, పున్న దినేశ్‌, ఎంఏ ఖలీల్‌, అలీం, రాఘవేందర్‌, వెంకటాపురం శివ, సురేశ్‌నాయక్‌, రాజు, వస్పుల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. షాబాద్‌ మండలంలోని కంది-షాద్‌నగర్‌ జాతీయ రహదారిపై శనివారం కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, భార్గవరాం, స్వామి, నర్సింహులు, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:02:01+05:30 IST