పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ధర్నా
ABN , First Publish Date - 2021-12-08T03:59:57+05:30 IST
డీజిల్, పెట్రోల్పై రాష్ట్ర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం మండల కేంద్రం లోని జాతీయరహదారిపై బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లాఅధ్యక్షుడు మహబూబ్అలీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు.
రెబ్బెన, డిసెంబరు 7: డీజిల్, పెట్రోల్పై రాష్ట్ర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం మండల కేంద్రం లోని జాతీయరహదారిపై బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లాఅధ్యక్షుడు మహబూబ్అలీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్పై పన్ను తగ్గించిందని, దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ధరలు తగ్గించారని కానీ తెలంగాణలో తగ్గించడం లేదన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నాయకులు సొల్లులక్ష్మి, నందకిశోర్, పవన్కళ్యాణ్, ఆనంద్కుమార్, మధుకర్ పాల్గొన్నారు.