అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ధర్నా
ABN , First Publish Date - 2021-07-27T04:35:54+05:30 IST
అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ధర్నా
కీసర: గ్రామంలో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని అంకిరెడ్డిపల్లి వాసులు కీసర సబ్స్టేషన్ వద్ద సోమవారం ధర్నా చేశారు. లోఓల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఏఈ బాల్రాజ్ వెంటనే ట్రాన్స్ఫ్మార్ కావాల్సిన ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులు బ్యాం క్లో కట్టిన డీడీ ల పత్రాలు ఇస్తే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ఏఈ తెలిపారు.