తాగునీటి సమస్య పరిష్కరించాలని ధర్నా

ABN , First Publish Date - 2020-10-15T07:51:18+05:30 IST

మండలం లోని తల్వేద గ్రామంలో గత కొన్ని రోజు లుగా నెలకున్న తాగునీటి సమస్య జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి

తాగునీటి సమస్య పరిష్కరించాలని ధర్నా

నందిపేట, అక్టోబరు 14: మండలం లోని తల్వేద గ్రామంలో గత కొన్ని రోజు లుగా నెలకున్న తాగునీటి సమస్య జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు జోక్యంతో తాగునీటి సమస్యకు పరిష్కా రం లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట మండలం తల్వేద గ్రామంలో ఒక కాలనీకి చెందిన 1హెచ్‌పీ మోటారు బంద్‌ కావడంతో ఆ కాలనీకి వాసులు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రు. పలుమార్లు సర్పంచ్‌ పంచాయతీ సె క్రెటరీకి విన్నవించినా పట్టించుకోక పోవ డంతో బుధవారం ఆ కాలనీకి సంబంధిం చిన ప్రజలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట ధర్నాకు దిగారు. నవీపేట మండలం తుంగిని గ్రామం నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న జిల్లా పరిషత్‌ చైర్మ న్‌ దాదన్నగారి విఠల్‌రావు తల్వేద గ్రామంలో ఆగారు. ఎక్కువ మొత్తంలో ప్రజలు గుమ్మిగూడడంతో విషయాన్ని తెలుసుకున్నారు.


తాగునీటిత సమస్యపై స్థానిక సర్పం చ్‌ను వివరాలు అడిగితెలుసుకున్నారు. దీనికి స్పందించి న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు డీపీవో జయసుధకు ఫోన్‌లో ఆదేశించారు. తల్వేద గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశిం చారు. దీనికి తాము సంబంధిత అధికారులను పరిష్క రించాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులుగా నెల కొన్న తాగునీటి సమస్యను పరిష్కరించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-10-15T07:51:18+05:30 IST