భారాలపై 11న ధర్నాలు: సీపీఎం

ABN , First Publish Date - 2022-07-02T09:07:07+05:30 IST

భారాలపై 11న ధర్నాలు: సీపీఎం

భారాలపై 11న ధర్నాలు: సీపీఎం

రాష్ట్రంలో ప్రజలపై పడుతున్న భారాలకు నిరసనగా ఈనెల 11న జిల్లా కలెక్టరేట్లు వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం విజయవాడలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర సంస్కరణల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని ఆరోపించారు. కలెక్టరేట్ల ఎదుట 11వ తేదీ ధర్నాకు ముందుగా కర్నూలు, అనంతపురంలో 4న ధర్నా చేస్తామని పేర్కొన్నారు. వలంటీర్లతో వైసీపీ నాయకులు ప్రజలను భయపెడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి సంక్షేమ పథకాలను నిలిపేస్తున్నారని శ్రీనివాసరావు ఆక్షేపించారు.


Updated Date - 2022-07-02T09:07:07+05:30 IST