ఆప్కాస్‌ రద్దు చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2020-12-04T02:38:31+05:30 IST

ఆప్కాస్‌(ఏపీసీవోఎస్‌)ను రద్దు చేసి పారిశుధ్య కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్‌

ఆప్కాస్‌ రద్దు చేయాలని ధర్నా
: మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు

కావలిటౌన్‌ డిసెంబరు3: ఆప్కాస్‌(ఏపీసీవోఎస్‌)ను రద్దు చేసి పారిశుధ్య కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధార్నా నిర్వహించారు. సీఐటీయూ గౌరవ అద్యక్షుడు పెంచలయ్య మాట్లాడుతూ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న కార్మికలను ఆప్కాస్‌ విధానంతో తొలగించడం అన్యాయమన్నారు.  అందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీ.మల్లికార్జునరావు, అమీర్‌బాష, జాన్‌, మాలకొండయ్య, పోలయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T02:38:31+05:30 IST