అందరూ విజేతలు కాలేరు..

ABN , First Publish Date - 2020-10-27T09:16:11+05:30 IST

చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎ్‌సకే) జట్టు ఫ్లేఆ్‌ఫ్సకు చేరకపోవడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సీఎ్‌సకే కెప్టెన్‌

అందరూ విజేతలు కాలేరు..

ధోనీ భార్య భావోద్వేగ పోస్ట్‌

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎ్‌సకే) జట్టు ఫ్లేఆ్‌ఫ్సకు చేరకపోవడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సీఎ్‌సకే కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ భార్య సాక్షీ సింగ్‌ సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ పెట్టింది. ‘ఇది ఆట మాత్రమే.. గెలుపోటములు సహజం. ఎవరూ ఓడిపోవాలనుకోరు. అందరూ విజేతలు కాలేరు. మీరు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ విజేతలే. నిజమైన పోరాటయోధులు పోరాడడం కోసమే జన్మిస్తారు. వారు మా హృదయాల్లో ఎప్పటికీ సూపర్‌కింగ్స్‌గానే నిలిచిపోతారు’ అంటూ కవితాత్మక రూపంలో సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 



Updated Date - 2020-10-27T09:16:11+05:30 IST