టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-23T13:35:31+05:30 IST
గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి(శుక్రవారం) తెల్లవారుజామునే వంద మందికి పైగా పోలీసులు పొన్నూరు మండలం చింతలపూడిలోని ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి పోలీసులు చేరుకున్నారు.
గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి(శుక్రవారం) తెల్లవారుజామునే వంద మందికి పైగా పోలీసులు పొన్నూరు మండలం చింతలపూడిలోని ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అకస్మాత్తుగా పోలీసులు పెద్ద సంఖ్యలో ఇంటికి రావడంతో ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు కారణం తెలియక అయోమయ స్థితిలో ఉండిపోయారు. అనంతరం ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.
కాగా.. సంగం డెయిరీలో అవకతవకలు జగిగాయంటూ నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీసులో ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీలో చైర్మన్గా ఉన్నారు. సంగంకు సంబంధించిన కేసులోనే ధూళిపాళ్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.