‘అలాగైతే టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారు’

ABN , First Publish Date - 2022-07-10T01:43:42+05:30 IST

జగన్ చేసేదీ రైతు వంచన పాలన అని టీడపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పరిటాల రైతు పోరు సభలో ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.

‘అలాగైతే టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారు’

ఎన్టీఆర్: జగన్ చేసేదీ రైతు వంచన పాలన అని టీడపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పరిటాల రైతు పోరు సభలో ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  రైతు భరోసా కేంద్రాలు... వైసీపీ నేతలు దోచుకోవడానికి సరిపోతుందన్నారు. 151 సీట్లు వచ్చిన జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారని? ప్రశ్నించారు. మోసం, నయవంచన జగన్ రక్తంలో ఉందని మండిపడ్డారు. దుష్టచతుష్టయం అంటే జగన్ అని, సాయిరెడ్డి, సజ్జల, వైవి సుబ్బారెడ్డి, కొడాలి నానిని తంతే పశువుల పాకాలో పడ్డారని విమర్శించారు. వైసీపీలో నాని స్థానం ఎంటో అందరికీ అర్థమై పోయిందన్నారు.

Updated Date - 2022-07-10T01:43:42+05:30 IST