సాగుబోర్లకు మీటర్లు బిగిస్తున్నారు: dhulipalla narendra
ABN , First Publish Date - 2022-05-17T01:00:37+05:30 IST
సాగుబోర్లకు మీటర్లు బిగిస్తున్నారు: dhulipalla narendra
అమరావతి: వైసీపీ పాలనలో వ్యవసాయానికి సాయం తగ్గిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రైతులను కులాల పేరుతో వైసీపీ ప్రభుత్వం విభజిస్తోందన్నారు. రాష్ట్రంలో సాగుబోర్లకు మీటర్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. రాయితీలు ఇవ్వడం ఎందుకు?.. మీటర్లు బిగించడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే మీటర్లన్నారు. ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఆర్బీకేల పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.