కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయి: ధూళిపాళ్ల నరేంద్ర

ABN , First Publish Date - 2022-04-18T19:22:48+05:30 IST

మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఏడు కేసుల్లో ముద్దాయి అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రతిష్ట దిగజార్చాలని కాకాణి ఆరోపణలు చేశారన్నారు.

కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయి: ధూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు: మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఏడు కేసుల్లో ముద్దాయి అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రతిష్ట దిగజార్చాలని కాకాణి ఆరోపణలు చేశారన్నారు. అక్రమ ఆధారాలపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. కల్పిత ఆధారాలు సృష్టించిన కేసులో ఆధారాలన్నీ కోర్టులో ఉన్నాయన్నారు. కాకాణిపై కేసులు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసిందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. ప్రభుత్వ జీవోను కోర్టు నిరాకరించిందన్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోర్టులో చోరీ జరిగిందన్నారు. కోర్టులో చోరీపై అనేక అనుమానాలున్నాయన్నారు. అన్ని ఫైల్స్‌లో కాకాణి ఫైల్ మాత్రమే ఎలా పోయిందని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. 


Updated Date - 2022-04-18T19:22:48+05:30 IST