కరోనాతో రిటైర్డ్‌ ఆర్డీవో మృతి

ABN , First Publish Date - 2021-04-24T04:05:48+05:30 IST

రిటైర్డ్‌ ఆర్డీవో కత్తి సుబ్రహ్మణ్యంరెడ్డి శుక్రవారం ఉదయం మృతి చెందారు.

కరోనాతో రిటైర్డ్‌ ఆర్డీవో మృతి

తడ, ఏప్రిల్‌ 23 : రిటైర్డ్‌ ఆర్డీవో కత్తి సుబ్రహ్మణ్యంరెడ్డి శుక్రవారం ఉదయం మృతి చెందారు. రెండు వారాల క్రితం కరోనా బారినపడ్డ ఆయన తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2013లో గూడూరు ఆర్డీవోగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం శ్రీసిటీ సెజ్‌లో రెవెన్యూ మరియు భూసేకరణ విభాగానికి జనరల్‌ మేనేజర్‌గా తిరుపతి కార్యాలయంలో పనిచేస్తున్నారు. కత్తి సుబ్రహ్మణ్యంరెడ్డి మృతి పట్ల శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా ఆయనతో తనకు అనుబంధం ఉందని, శ్రీసిటీ అభివృద్ధికి ఆయన ఎంతో దోహదపడ్డారని  కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢసానుభూతిని తెలిపారు.

Updated Date - 2021-04-24T04:05:48+05:30 IST