వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం
ABN , First Publish Date - 2021-07-27T05:45:23+05:30 IST
ఫెన్సింగ్ రాళ్లలోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రాళ్ల కిందపడి కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని నేరేళ్లవాగు సమీపంలో సోమవారం జరిగింది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల మేరకు... కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ట్రాక్టర్ ఫెన్సింగ్ రాళ్ల లోడుతో పామూరుకు బయలుదేరింది. మండలంలోని రజాసహేబ్పేట గ్రామంలోని ఓ తోటకు ఫెన్సింగ్ రాళ్లను తీసుకొని ఈ ట్రాక్టర్ వస్తోంది. గ్రామ సమీపంలోని నేరెళ్లవాగులో అదుపు తప్పి ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది.
పామూరులో ఫెన్సింగ్ రాళ్ల ట్రాక్టర్ బోల్తా
ఇద్దరు వ్యక్తులు మృతి
చినగంజాంలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ
డ్రైవర్ మృత్యువాత
అందరూ కడప జిల్లా ప్రొద్దుటూరు మండల వాసులే..!
పామూరు, జూలై 26:
జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతిచెందిన ముగ్గురూ కడప జిల్లా ప్రొద్దుటూరు మండల వాసులు కావడం గమనార్హం. ప్రొద్దుటూరు నుంచి పెన్సింగ్ రాళ్లతో వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ పామూరు మండలం నేరెళ్లవాగు సమీపంలో బోల్తాపడిన ఘటనలో ప్రొద్దుటూరు మండలం కాకిరేణిపల్లి గ్రామానికి చెందిన ఉండేల చంద్రఓబుల్రెడ్డి (38), సుంకేశుల పెద్దహుస్సేన్ (45) మృతిచెందారు. అలాగే జమ్మలమడుగు నుంచి అవనిగడ్డకు వెళుతున్న సిమెంట్ లోడ్ లారీ చినగంజాం వద్ద డివైడర్ను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామ వివేకాందనగర్కు చెందిన డ్రైవర్ ప్రభాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఫెన్సింగ్ రాళ్లలోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రాళ్ల కిందపడి కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని నేరేళ్లవాగు సమీపంలో సోమవారం జరిగింది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల మేరకు... కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ట్రాక్టర్ ఫెన్సింగ్ రాళ్ల లోడుతో పామూరుకు బయలుదేరింది. మండలంలోని రజాసహేబ్పేట గ్రామంలోని ఓ తోటకు ఫెన్సింగ్ రాళ్లను తీసుకొని ఈ ట్రాక్టర్ వస్తోంది. గ్రామ సమీపంలోని నేరెళ్లవాగులో అదుపు తప్పి ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కాకిరేణిపల్లి గ్రామానికి చెందిన ఉండేల చంద్రఓబుల్రెడ్డి (38), సుంకేశుల పెద్దహుస్సేన్ (45) అనే వ్యక్తులు రాళ్లపై కూర్చొని ఉన్నారు. ప్రమాదంలో రాళ్ల కింద పడి నలిగి ఊపిరి ఆడక మృతిచెందారు. ట్రాక్టర్ను తోలుతున్న డ్రైవర్ గుత్తి మస్తాన్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కూలి కోసం వచ్చిన ఆ ఇద్దరు ఈ ఘటనలో మృతి చెందారు. ఎస్సై కే.సురేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఎక్స్కవేటర్ సహాయంతో రాళ్లను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాలువలోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ, డ్రైవర్ మృతి
చినగంజాం : సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి మురుగు కాలువలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన చినగంజాం 216 నెంబరు జాతీయ రహదారి జంక్షన్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పీ.అంకమ్మరావు తెలిపిన వివరాలు ప్రకారం కడప జిల్లా జమ్మలమడుగులోని దాల్మియా సిమెంట్ కంపెనీ నుంచి ఏపీ04టీటీ6667 నెంబరుగల లారీ సిమెంట్ లోడుతో కృష్ణా జిల్లా అవినిగడ్డకు వెళ్తోంది. ఆదివారం సాయంత్రం కంపెనీ వద్ద నుంచి సిమెంట్ లోడుతో కూరకు ప్రభాకర్(40) బయలుదేరాడు. సిమెంట్ లోడుతో వస్తున్న లారీ సోమవారం వేకువజామున 4గంటల సమయంలో చినగంజాం 216 నెంబరు జాతీయ రహదారి జంక్షన్ సమీపంలోని రహదారిపై గల డివైడర్ను ఢీకొని, ఎడమవైపు గల మరుగుకాలువలోకి దూసుకెళ్లింది. మురుగుకాలువలోని మట్టిదిబ్బలు, చిల్లచెట్లలోనికి పూర్తిగా లారీ మందు భాగం కూరుకుపోవడంతో లారీలోని సిమెంట్ బస్తాలు అన్ని క్యాబిన్పై పడి లారీ నడుపుతున్న ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఎక్స్కవేటర్ సహాయంతో డ్రైవర్ని బయటకు తీశారు. మృతి చెందిన ప్రభాకర్ది ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామంలోని వివేకాందనగర్. మృతుడి కుమారుడు నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. నిద్రమత్తు వలనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.