వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
ABN , First Publish Date - 2021-03-09T06:00:36+05:30 IST
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
కందుకూరు: మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బిహార్ రాష్ట్రానికి చెందిన వికాస్ రెండేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి బొద్దం కృష్ణారెడ్డి పౌల్ర్టీ ఫాంలో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి కృష్ణారెడ్డి బైక్ తీసుకొని మీర్ఖాన్పేట వరకు కొత్తగా వేస్తున్న ఫార్మాసిటీ రోడ్డుపై వెళుతూ డివైడర్కు ఢీకొని మృతిచెందాడు. మరో సంఘటలో సోమవారం సాయంత్రం తలకొండపల్లి మండలం పెద్దపడకల్కు చెందిన లక్ష్మి-ఆంజనేయులు దంపతులు నగరం నుంచి గ్రామానికి బైక్పై వెళ్తుండగా దెబ్బడగూడ గేటు సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్నారు. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి.
- బైక్ బోల్తాపడి బాలిక ...
కొత్తూర్: కొత్తూర్ మండలం తిమ్మాపూర్ సమీపంలో 44వ హైవేపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సోని(12) అనే బాలిక మృతిచెదింది. ఇన్స్పెక్టర్ భూపాల్శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఫరీద్పూర్కు చెందిన రమే్షనాయక్ నగరంలో పనిచేసుకుంటున్నాడు. ఇటీవల గ్రామానికి వెళ్లి కుతూరు సోని, కుమారుడు ప్రకా్ష(10)లతో బైక్పై హైదరాబాద్కు వెళ్తున్నారు. తిమ్మాపూర్ సమీపంలో ఓ వ్యక్తిని తప్పించబోయి బైక్ బోల్తా పడింది. రమే్షనాయక్, ప్రకాష్ ఎడమ వైపు, సోనీ కుడివైపు పడిపోయారు. వెనుక నుంచి వచ్చిన వాహనం సోని తలపై నుంచి పోవడంతో మృతిచెందిందన్నారు. సోనీ 8వ తరగతి చదువుతోందన్నారు. కళ్ల ముందే సోనీ చనిపోవడంతో రమే్షనాయక్, ప్రకాష్ కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని షాద్నగర్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ భూపాల్శ్రీధర్ తెలిపారు.