నారసింహుడికీ దారి కష్టాలు

ABN , First Publish Date - 2022-01-26T05:17:14+05:30 IST

అహోబిల నారసింహుడికీ దారి కష్టాలు తప్పడం లేదు. జనవరి 15న రాత్రి నారసింహుడి పార్వేట ఉత్సవం మొదలైంది.

నారసింహుడికీ దారి కష్టాలు

 వరి మడుల్లో పల్లకిని మోసిన బోయీలు

రుద్రవరం, జనవరి 25: అహోబిల నారసింహుడికీ దారి కష్టాలు తప్పడం లేదు. జనవరి 15న రాత్రి నారసింహుడి పార్వేట ఉత్సవం మొదలైంది. ఇందులో భాగంగా బోయీలు పల్లకిని మోస్తూ పల్లెలకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం రుద్రవరం మండలం తిమ్మనపల్లె గ్రామం నుంచి నరసాపురం గ్రామానికి వెళ్లే రోడ్డు సరిగా లేకపోవడంతో వరి నాట్లలో వెళ్లాల్సి వచ్చింది. రెండు గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల దూరం ఉంది. అధికారులు పట్టించుకోక పోవడంతో ప్రతి ఏటా ఇదే సమస్య నెలకొంటోంది. ఇలాంటి దారిలో పల్లకిని ఎలా మోసేదని బోయీలు ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2022-01-26T05:17:14+05:30 IST