ఫ్యాక్షనపై ప్రత్యేక నిఘా

ABN , First Publish Date - 2022-08-18T05:05:30+05:30 IST

ఫ్యాక్షనపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఐజీ రవిప్రకాశ పేర్కొన్నారు. ఆయన బుధవారం స్థానిక అర్బన పోలీసు స్టేషనను తనిఖీ చేశారు.

ఫ్యాక్షనపై ప్రత్యేక నిఘా

డీఐజీ రవిప్రకాశ

ధర్మవరం, ఆగస్టు 17: ఫ్యాక్షనపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఐజీ రవిప్రకాశ పేర్కొన్నారు. ఆయన బుధవారం స్థానిక అర్బన పోలీసు స్టేషనను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధర్మవరం ప్రాంతంలో ఫ్యాక్షన తగ్గినట్లు కనిపిస్తున్నా.. నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే దిశగాపోలీసులు, అధికారులు ఇప్పటి నుంచే ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఫ్యాక్షన గొడవలు, హత్యలు జరిగితే  సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మట్కా, గుట్కా, జూదం లాంటివాటికి అడ్డుకట్ట వేస్తామన్నారు. అనంతరం ఆయన.. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌, డీఎస్పీ రమాకాంత, సీఐలు సుబ్రహ్మణ్యం, రాజా, మన్సూరుద్దీన, ఎస్‌ఐలు మహమ్మద్‌రఫీ, ప్రదీ్‌పకుమార్‌తో సమీక్ష నిర్వహించారు.






Updated Date - 2022-08-18T05:05:30+05:30 IST