కంతేరు ఘటనపై డీఐజీ త్రివిక్రమవర్మ ఏమన్నారంటే...
ABN , First Publish Date - 2022-06-13T19:38:23+05:30 IST
కంతేరు ఘటనపై డీఐజీ త్రివిక్రమ వర్మ స్పందించారు.
గుంటూరు: కంతేరు ఘటనపై డీఐజీ త్రివిక్రమ వర్మ(trivikrama varma) స్పందించారు. సోమవారం డీఐజీ మీడియాతో మాట్లాడుతూ... కంతేరులో సునీత, వంశీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఇద్దరి ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. రెండు కేసుల్లో అరెస్టులు చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతున్నప్పుడు శాంతిభద్రతలు సమస్య తలెత్తేలా గ్రామానికి వెళతామనడం కరెక్ట్ కాదన్నారు. వ్యక్తిగత గొడవలను రాజకీయం చేయద్దని సూచించారు. చలో కంతేరుకు పిలుపునివ్వడం మంచిది కాదని, వెంకాయమ్మ ఇంటివద్ద పికెట్ పెట్టామని డీఐజీ త్రివిక్రమవర్మ వెల్లడించారు.