గుప్తనిధుల కోసం తవ్వకాలు

ABN , First Publish Date - 2022-07-07T06:04:16+05:30 IST

గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసి పురాతన దేవాలయాన్ని ధ్వంసం చేశారు.

గుప్తనిధుల కోసం తవ్వకాలు
గుప్త నిధుల కోసం తవ్విన ప్రదేశం

నల్లగొండ జిల్లాలో ఘటన 

నిడమనూరు, జూలై 6: గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసి పురాతన దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని మారుపాక గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంతల కోటయ్య ఆయన తమ్ముడు బొంతల శివకుమార్‌లు అదే గ్రామానికి చెందిన నందికొండ నాగలక్ష్మీకి చెందిన వ్యవసాయ భూమిని కౌలుకు తీసుసుకొని మూడేళ్లుగా నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన కౌలుకు చేస్తున్న వ్యవసాయ భూమిలో బొంతల కోటయ్య, శివలు, మరికొంతమంది కలిసి వంద ఏళ్ల నుంచి పొలంలో ఉన్న శివాలయం గుడిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసి గుప్త నిధుల కోసం దేవాలయాన్ని కూల్చారని పోలీసులు తెలిపారు. నందికొండ నాగలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-07-07T06:04:16+05:30 IST