ఓటర్లకు డిజిటల్‌ కార్డులు

ABN , First Publish Date - 2020-11-29T05:15:18+05:30 IST

ఓటర్లకు డిజిటల్‌ కార్డుల అందజేయాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తమరాల సీతారాం తెలిపారు. శనివారం మండపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు.

ఓటర్లకు డిజిటల్‌ కార్డులు
ఇచ్ఛాపురం: బీఎల్‌ఓతో మాట్లాడుతున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌


  స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తమరాల సీతారాం 

ఇచ్ఛాపురం/ రూరల్‌: ఓటర్లకు డిజిటల్‌ కార్డుల అందజేయాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తమరాల సీతారాం తెలిపారు. శనివారం మండపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు డిజిటల్‌ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మురళీమోహన్‌, డీటీ శ్రీహరి పాల్గొన్నారు. మునిసిపాలిటీ పరిధిలో గల బాలబాలికలు ఉన్నత పాఠశాలతోపాటు బెల్లుపడ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. 

ఆమదాలవలస రూరల్‌:పురపాలక సంఘంలో 32,33,34,35,36,44 పోలింగ్‌ కేంద్రాలను తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు, మార్పు లు చేర్పులపై అభియోగాలు ఉంటే బీఎల్‌ వోలకు తెలియజే యాలని సూచించారు. ఆయనతో పాటు ఎన్నికల డీటీ మురళీధర్‌ నాయక్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ చంద్రమౌళి ఉన్నారు.

లావేరు: మండలంలోని 56 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు జాబితాలను శనివారం ప్రదర్శించారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లగా నమోదు కావాలని తహసీల్దార్‌ దిలీప్‌ చక్రవర్తి తెలిపారు. గురుగుబిల్లి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో బీఎల్‌వో సత్యవతి, ఉపాధ్యాయులు రమణమ్మ, ఉమాశంకర్‌, ఇంజనీరింగ్‌ సహాయకులు రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-11-29T05:15:18+05:30 IST