Digvijay Singh: రాష్ట్ర విభజన ఏపీకి గాయం చేసిందని అంగీరిస్తున్నాం...
ABN , First Publish Date - 2022-10-04T18:38:46+05:30 IST
భారత్కు భిన్నత్వంలో ఏకత్వం బలమని, ఇపుడు బీజేపీ దాన్ని విచ్చినం చేస్తోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
కర్నూలు (Kurnool): భారత్కు భిన్నత్వంలో ఏకత్వం బలమని, ఇపుడు బీజేపీ (BJP) దాన్ని విచ్చినం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఏపీకి గాయం చేసిందని అంగీరిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Jodo Yatra) మొదలై నెల రోజులు కూడా పూర్తి కాకుండానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ యాత్ర గురించి భయపడుతున్నాయని అన్నారు. భారత్లో నిరుద్యోగం, పేదరికం పెరుగుతోందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఏపీలో కాంగ్రెస్ ఖచ్చితంగా బలపడుతుందని దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.