శిథిలావస్థలో పాఠశాల భవనం

ABN , First Publish Date - 2022-06-27T05:17:03+05:30 IST

మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలోని వెనుకతండా ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు

శిథిలావస్థలో పాఠశాల భవనం
శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం

మాసాయిపేట, జూన్‌ 26: మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలోని వెనుకతండా ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో రెండు భవనాలు ఉండగా పురాతన భవనంలో పాఠశాలను నడిపిస్తున్నారు. వర్షాకాలంలో ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. వెంటనే పాఠశాల భవనంపై అధికారులు దృష్టి సారించి భవన మరమ్మతులతో పాటు ప్రహరీ నిర్మాణం చేపట్టి, నీటి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2022-06-27T05:17:03+05:30 IST