డిప్లొమా పరీక్షలను నిలిపివేయాలి

ABN , First Publish Date - 2020-09-23T10:11:50+05:30 IST

డిప్లొమా పరీక్షలను నిలిపి వేయాలని విద్యార్థులు మంగళవారం చలో రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించా రు

డిప్లొమా పరీక్షలను నిలిపివేయాలి

రాజ్‌భవన్‌ ముట్టడికి విద్యార్థుల యత్నం, అరెస్టు


బేగంపేట, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): డిప్లొమా పరీక్షలను నిలిపి వేయాలని విద్యార్థులు మంగళవారం చలో రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో విద్యార్థులు అధిక సంఖ్యలో నినాదాలు చేసుకుంటూ రాజ్‌భవన్‌ వద్దకు వచ్చేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోని తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్రంలో డిప్లొమా మొదటి, రెండో ఏడాది పరీక్షలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్‌భవన్‌ వద్ద ఆందోళనకు యత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.   

Updated Date - 2020-09-23T10:11:50+05:30 IST