రోడ్డు ప్రమాదంలో డిప్లొమా విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-07-30T06:38:08+05:30 IST

నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డి ప్లొమా విద్యార్థి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో డిప్లొమా విద్యార్థి మృతి
సాకే విష్ణువర్ధన మృతదేహం


 

అనంతపురం క్రైం, జూలై 29 : నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డి ప్లొమా విద్యార్థి మృతి చెందాడు. అనంతపు రం రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్‌ మండలం జీ కొట్టాలపల్లికి చెంది న సాకే విష్ణువర్ధన (19) నగరంలోని జేఎన టీయూలో డిప్లొమా ఫైనల్‌ ఇయర్‌ చదు వుతున్నాడు. తన స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంలో  వ్యక్తిగత పనుల నిమిత్తం గురువారం బయలుదేరాడు. అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి గ్రామ సమీపంలో పెద్దమ్మ గుడి వ ద్దకు రాగానే.. అదే సమయంలో జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశకు చెందిన ఓ లారీ హైదరాబాద్‌ నుంచి బెంగుళూర్‌వైపు వెళ్తూ వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. లారీ ముందు చక్రాలు విష్ణువర్ధనపై పోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని విలపించారు. ఈ ఘటనపై అనంతపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-07-30T06:38:08+05:30 IST