నిర్దేశక్‌.. జలప్రవేశం

ABN , First Publish Date - 2022-05-27T09:10:55+05:30 IST

నిర్దేశక్‌ (లార్జ్‌) సర్వే నౌక గురువారం జల ప్రవేశం చేసింది. తూర్పు నౌకాదళం ప్రధానాధికారి బిశ్వజిత్‌ దాస్‌గుప్తా సతీమణి సర్బాని దాస్‌గుప్తా దీనిని ప్రారంభించారు.

నిర్దేశక్‌.. జలప్రవేశం

ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం : నిర్దేశక్‌ (లార్జ్‌) సర్వే నౌక గురువారం జల ప్రవేశం చేసింది. తూర్పు నౌకాదళం ప్రధానాధికారి బిశ్వజిత్‌ దాస్‌గుప్తా సతీమణి సర్బాని దాస్‌గుప్తా దీనిని ప్రారంభించారు. కోల్‌కతా గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ ఈ నౌకను నిర్మించింది. మరో మూడు సర్వే నౌకలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. వీటితో హైడ్రోగ్రఫిక్‌, ఓషనోగ్రఫీ సర్వేలో నేవీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. నిర్దేశక్‌ నౌక పొడవు 110 మీటర్లు కాగా బరువు 3,400 టన్నులు. ఇందులో అత్యంత ఆధునికమైన హైడ్రోగ్రఫిక్‌ పరికరాలు అమర్చారు.

Updated Date - 2022-05-27T09:10:55+05:30 IST