నిర్దేశక్.. జలప్రవేశం
ABN , First Publish Date - 2022-05-27T09:10:55+05:30 IST
నిర్దేశక్ (లార్జ్) సర్వే నౌక గురువారం జల ప్రవేశం చేసింది. తూర్పు నౌకాదళం ప్రధానాధికారి బిశ్వజిత్ దాస్గుప్తా సతీమణి సర్బాని దాస్గుప్తా దీనిని ప్రారంభించారు.
ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం : నిర్దేశక్ (లార్జ్) సర్వే నౌక గురువారం జల ప్రవేశం చేసింది. తూర్పు నౌకాదళం ప్రధానాధికారి బిశ్వజిత్ దాస్గుప్తా సతీమణి సర్బాని దాస్గుప్తా దీనిని ప్రారంభించారు. కోల్కతా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఈ నౌకను నిర్మించింది. మరో మూడు సర్వే నౌకలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. వీటితో హైడ్రోగ్రఫిక్, ఓషనోగ్రఫీ సర్వేలో నేవీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. నిర్దేశక్ నౌక పొడవు 110 మీటర్లు కాగా బరువు 3,400 టన్నులు. ఇందులో అత్యంత ఆధునికమైన హైడ్రోగ్రఫిక్ పరికరాలు అమర్చారు.