Tollywood Drugs Case: పూరీ జగన్నాథ్, తరుణ్‌కు క్లీన్ చిట్

ABN , First Publish Date - 2021-09-18T22:20:39+05:30 IST

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ వచ్చింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, హీరో తరుణ్‌కు ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) క్లీన్ చిట్ ఇచ్చింది.

Tollywood Drugs Case: పూరీ జగన్నాథ్, తరుణ్‌కు క్లీన్ చిట్

హైదరాబాద్: టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ వచ్చింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, హీరో తరుణ్‌కు ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) క్లీన్ చిట్ ఇచ్చింది. పూరీ జగన్నాథ్, తరుణ్ నుంచి సేకరించిన రక్తం, వెంట్రుకలు, గోళ్ల శాంపిళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎస్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు ఛార్జిషీట్‌లో పేర్కొంది.


2017 జులైలో పూరి జగన్నాథ్, తరుణ్ నుంచి ఎక్సైజ్ శాఖ నమూనాలు సేకరించింది. ఈ నమూనాలపై గతేడాది డిసెంబర్‌ 8న ఎక్సైజ్‌శాఖకు ఎఫ్ఎస్ఎస్ నివేదికలు సమర్పించింది. డ్రగ్స్ కేసులో ప్రధాన కెల్విన్‌తో పాటు ఛార్జిషీట్‌లో ఉన్న సినీ ప్రముఖులను కూడా ఇటీవల ఈడీ విచారించిన విషయం తెలిసిందే.


మరోవైపు ప్రధాన నిందితుడు కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌తో పాటు వివరాలను ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించింది. అలాగే ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు అందించింది. ఈ నేపథ్యంలో కెల్విన్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్‌ 9న విచారణకు హాజరుకావాలని కెల్విన్‌‌ను కోర్టు ఆదేశించింది.



Updated Date - 2021-09-18T22:20:39+05:30 IST