‘పూరి’ ఆర్థిక లావాదేవీలపై ఆరా..
ABN , First Publish Date - 2021-08-31T23:03:55+05:30 IST
‘పూరి’ ఆర్థిక లావాదేవీలపై ఆరా..
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను ఈడీ విచారిస్తోంది. ఆయన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. సుమారు 6గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్ల విషయంలో ఎంతమేర ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న అంశంపై విచారిస్తున్నారు. పూరి జగన్నాథ్కు సంబంధించి మూడు బ్యాంక్ ఎకౌంట్లను పరీశీలిస్తున్నారు. అలాగే ఆయన సొంత వైష్ణో బ్యానర్, పూరి కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రిపోర్టులను పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు. గతంలో అరెస్టయిన నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ స్టేట్మెంట్ను అధికారులు లిఖిత పూర్వకంగా నమోదు చేసుకుంటున్నారు. పీఎమ్ఎల్ఏ యాక్ట్ సెక్షన్ 3.4 ప్రకారం పూరీని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.