ఇప్పటికీ మట్టి రోడ్డే

ABN , First Publish Date - 2021-04-17T04:52:41+05:30 IST

స్వాతంత్య్రం వచ్చి 74ఏళ్లు అయినా బనగానపల్లె మండలం క్రిష్ణగిరి నుంచి మంగంపేట, మంగంపేట తండా, సీతారామానగర్‌ వరకు మట్టిరోడ్డే ఉన్నది.

ఇప్పటికీ మట్టి రోడ్డే
మంగంపేట మట్టిరోడ్డు

స్వాతంత్య్రం వచ్చి 74ఏళ్లు అయినా బనగానపల్లె మండలం క్రిష్ణగిరి నుంచి మంగంపేట, మంగంపేట తండా, సీతారామానగర్‌ వరకు మట్టిరోడ్డే ఉన్నది.  11 కిలోమీటర్లు మట్టిరోడ్డే గతి.  స్వాతంత్ర్యానంతరం ఒక్కసారి మాత్రం ఈ మార్గంలో కంకరరోడ్డు వేశారు. ఆ తర్వాత ఇక పట్టించుకోలేదు. తారురోడ్లు వేయలేదు. మంగంపేటతండాలో జీవిస్తున్న  సుగాలీలు  ఇబ్బంది పడుతున్నారు.   పాతపాడు నుంచి పెద్దరాజుపాలెం వరకు కూడా సింగిల్‌ రోడ్డు మాత్రమే ఉంది.  గుంతలకు  తాత్కాలిక మరమ్మతులతో  సరిపెడుతున్నారు. ఈ మార్గంలో డబుల్‌ రోడ్డు వేయాలని  ప్రజలు కోరుతున్నారు.   
- బనగానపల్లె  


Updated Date - 2021-04-17T04:52:41+05:30 IST