కొత్త సంవత్సరం రోజున పెన్షనర్లకు నిరాశ
ABN , First Publish Date - 2022-01-01T23:06:50+05:30 IST
రాష్ట్రంలోని పెన్షనర్లకు కొత్త సంవత్సరం రోజున
అమరావతి: రాష్ట్రంలోని పెన్షనర్లకు కొత్త సంవత్సరం రోజున నిరాశే మిగిలింది. ఇప్పటివరకు ఇంకా పెన్షన్లు పడలేదు. గత నెలలో 1వ తేదీన పెన్షన్లను వేసి ఏపీ ప్రభుత్వం మురిపించింది. అంతకుముందు ప్రతి నెలా 15వ తేదీ వరకు పెన్షన్లు పడుతూనే ఉన్నాయి. అయితే కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ కావడంతో పెన్షన్ల కోసం పెన్షనర్లు ఎదురుచూసారు. సగానికి పైగా ఉద్యోగులకు కూడా జీతాలు పడలేదు. రాష్ట్రంలోని 4 లక్షల మంది పెన్షనర్లకు నిరాశే ఎదురయింది.