ఎన్సీసీతో క్రమశిక్షణ: డీఎస్పీ
ABN , First Publish Date - 2021-11-29T05:18:56+05:30 IST
ఎన్సీసీ ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని డీఎస్పీ వినోద్కుమార్ అన్నారు.
ఆదోని(అగ్రికల్చర్), నవంబరు 28: ఎన్సీసీ ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని డీఎస్పీ వినోద్కుమార్ అన్నారు. ఆదివారం 75వ ఎన్సీసీ డే ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ హైస్కూల్ మైదానం నుంచి ఎన్సీసీ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్సీ సీ ద్వారా దేశభక్తి అలవర్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ చీఫ్ ఆఫీసర్స్ ఎల్కే చిన్నప్ప, ఎల్లప్ప, రవి, సీటీవోలు సుధాకర్, బాబు, ఈశ్వరమ్మ, సీఈ శ్రీరాములు, ఎస్ఈ హనుమంతురెడ్డి పాల్గొన్నారు.