గుర్తింపు కార్డులతో రాయితీలు

ABN , First Publish Date - 2021-06-17T04:44:34+05:30 IST

కౌలు రైతులు గుర్తింపు కార్డులతో రాయితీలు పొందవచ్చని వ్యవసా యాధి కారి పి.శ్రీకాంత్‌వర్మ అన్నారు. బుధవారం కాపుతెంబూరు, దేవళభద్ర రైతుభరోసా కేంద్రాల్లో కౌలురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

గుర్తింపు కార్డులతో రాయితీలు
నందిగాం: మాట్లాడుతున్న ఏవో శ్రీకాంత్‌వర్మ

నందిగాం: కౌలు రైతులు గుర్తింపు కార్డులతో రాయితీలు పొందవచ్చని వ్యవసాయాధికారి పి.శ్రీకాంత్‌వర్మ అన్నారు. బుధవారం కాపుతెంబూరు, దేవళభద్ర రైతుభరోసా కేంద్రాల్లో కౌలురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సాగు ధ్రువీకరణ పత్రం పొందడం ద్వారా రాయితీలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అరులైనవారు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పోలాకి మోహనరావు, సీహెచ్‌ పార్వతి, వీఏఏలు పాల్గొన్నారు.

వరి విత్తనాల పంపిణీ

లింగాలవలస (జలుమూరు): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి విత్తనాలను బుధవారం లింగాలవలస ఆర్బీసీలో రైతులకు చల్లవానిపేట సొసైటీ మాజీ చైర్‌పర్సన్‌ బుక్క లక్ష్మణరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలు అవసరమైన వారు ఆర్బీసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. 

 


Updated Date - 2021-06-17T04:44:34+05:30 IST