‘ఇప్పటికీ దళితుల పట్ల వివక్ష అన్యాయం’

ABN , First Publish Date - 2021-07-25T06:03:00+05:30 IST

సమాజంలో దళితుల పట్ల ఇప్పటికీ వివక్ష అన్యాయమని ఏపీ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ బోర్డు సభ్యుడు సోనిహుడ్‌ వాపోయారు.

‘ఇప్పటికీ దళితుల పట్ల వివక్ష అన్యాయం’
సన్యాసిరాజుపాలెంలో మాట్లాడుతున్న ఏపీ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యుడు సోని హుడ్‌

కోటవురట్ల/పాయకరావుపేటరూరల్‌, జూలై 24 : సమాజంలో దళితుల పట్ల ఇప్పటికీ వివక్ష అన్యాయమని ఏపీ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ బోర్డు సభ్యుడు సోనిహుడ్‌ వాపోయారు. కోటవురట్ల మండలంలోని సన్యాసిరాజుపాలెంలో ఇటీవల దళిత మహిళ రత్నంపై అగ్రవర్ణాలవారు దాడి చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటన సదస్సులో మాట్లాడుతూ దళితులపై దాడులు  సహించేది లేద న్నారు. ఈ ఘటనలపై పోలీసులు నిర్లక్ష్యం, పక్షపాతం చూపితే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతా నన్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మితో పాటు మూడు మండలాలకు చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, పాయకరావు పేట మండలం శ్రీరాంపురంలో పర్యటించారు. తొలుత తుని, పాయకరావుపేటలకు చెందిన పాస్టర్లతో కలిసి ఇక్కడ వివాదంలో ఉన్న చర్చి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ గ్రామంలో చర్చి నిర్మాణ స్థలం సమస్యను పరిష్కరించి, చర్చిని పునర్నిర్మాణానికి   కృషి చేస్తానని చెప్పారు. పాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు  అల్లి ఆనంద్‌కుమార్‌, ఛార్టెస్‌ పిన్ని, మాజీ సర్పంచ్‌ గంగిరెడ్ల వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:03:00+05:30 IST