ముస్లింలపై వివక్ష విడనాడాలి
ABN , First Publish Date - 2022-06-29T05:08:14+05:30 IST
ముస్లింలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చూపుతున్న వివక్ష విడనాడాలని కోరుతూ జమ్మలమడుగులో టీడీపీ నేతలు, ముస్లింలు ర్యాలీ నిర్వహించారు.
దుల్హన్ పథకాన్ని అమలు చేయాలని ర్యాలీ
జమ్మలమడుగు రూరల్, జూన్ 28: ముస్లింలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చూపుతున్న వివక్ష విడనాడాలని కోరుతూ జమ్మలమడుగులో టీడీపీ నేతలు, ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. పురవీధుల్లో ముస్లింలు ర్యాలీ నిర్వహించి దుల్హ న్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెం టనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ జమ్మలమడుగు ఆర్డీ ఓ కార్యాలయం చేరుకున్న అనంత రం సంబంధిత అధికారి రూపే్ష కు, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు, ముస్లింలు వినతి పత్రం అందజేశారు. టీడీపీ నేతలు రఫి, ఖదీర్ మాట్లాడుతూ పేద ముస్లింలకు పెళ్లికానుక కింద రూ.లక్ష ఇచ్చి ఆదుకుంటానని నమ్మించి మోసం చేశారన్నారు.
విదేశాల్లో చదివే విద్యార్థులకు ఆర్థికసాయం ఇస్తానని మధ్యలోనే నిలిపేశారన్నా రు. నమ్మకద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరులో వైసీపీ ప్రజాప్రతినిధి అండతోనే అధికారులు దస్తగిరిస్వామి దర్గాను కూల్చడం దారుణమన్నారు. ముస్లింల ఐక్యతతో వైసీ పీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జె.రమణారెడ్డి, అన్నెబోయిన కొండయ్య, సయ్యద్, మెకానిక్ దాదాపీర్, పొన్నతోట శ్రీనివాసులు, మల్లికార్జున పాల్గొన్నారు.