మా వార్డుపై వివక్ష తగదు
ABN , First Publish Date - 2022-08-17T04:45:21+05:30 IST
మా వార్డుపై వివక్ష చూపడం తగదని ఏడవ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ నూరిబేగం ఆవేదన వ్య క్తం చేశారు.
- ఏడవ వార్డు కౌన్సిలర్ నూరిబేగం
- సమస్యలు పరిష్కరించాలని నిరాహార దీక్ష
అచ్చంపేటటౌన్, ఆగస్టు 16: మా వార్డుపై వివక్ష చూపడం తగదని ఏడవ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ నూరిబేగం ఆవేదన వ్య క్తం చేశారు. వార్డులో స మస్యలు ప రిష్కరించా లని మంగళవారం పట్ట ణంలోని అమరవీరుల స్థూపం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు కానీ, ఏడవ వార్డులో మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని వాపో యారు. మహేంద్రనగర్ కాలనీ మా త్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు ఒక్క సీసీ రోడ్డు కానీ, డ్రైనేజీ నిర్మాణం గానీ ప్రారంభించలేదన్నారు. రోడ్లన్నీ అధ్వానంగా మారాయన్నారు. కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాల కవర్గం తీరుతో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నానని వాపోయారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అనే వివక్ష చూపుతు న్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అభివృద్ధి పనులకు నిధు లు మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతానని హెచ్చరిం చా రు. అనంతరం కాంగ్రెస్ నా యకులు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్ర మంలో కౌన్సిలర్ గౌరీశంకర్, కాంగ్రెస్నాయకులు రమానాథం, మహబూబ్ అలీ పాల్గొన్నారు.