National flag: ఏలూరులో జాతీయ పతాకానికి అవమానం
ABN , First Publish Date - 2022-08-13T14:40:59+05:30 IST
జిల్లాలోని పెదవేగి మండలం రాట్నాలకుంటలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది.
ఏలూరు: జిల్లాలోని పెదవేగి మండలం రాట్నాలకుంటలో జాతీయ పతాకాని (National flag)కి అవమానం జరిగింది. గ్రామంలో స్థానికులు అంబేద్కర్ విగ్రహం పక్కన కొత్తగా దిమ్మ కట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే గత రాత్రి పోలీసులు అక్కడకు చేరుకుని జాతీయ పతాకాన్ని తొలగించి, దిమ్మను బుల్ డోజర్తో ధ్వంసం చేశారు. అనుమతి లేకుండా నిర్మించారనే కారణంతో, అధికారుల సూచనతో తొలగించామని పోలీసులు చెబుతున్నారు.