అతివల రక్షణ కవచం దిశ యాప్‌

ABN , First Publish Date - 2021-07-27T06:43:53+05:30 IST

కాకినాడ క్రైం, జూలై 26: అతివలు, బాలికల రక్షణ కవచంలా దిశ యాప్‌ నిలుస్తుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా పోలీసు కన్వెన్షన్‌ హల్లో సోమవారం ‘మహిళా భద్రత- దిశ యాప్‌’ అంశంపై నిర్వహించిన మెగా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతే ప్రధాన ఆశయంగా ప్రభుత్వం, పోలీసుశాఖ పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, 3 అర్బన్‌ పోలీసు జి

అతివల రక్షణ కవచం దిశ యాప్‌
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

మెగా అవగాహనా సదస్సులో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

కాకినాడ క్రైం, జూలై 26: అతివలు, బాలికల రక్షణ కవచంలా దిశ యాప్‌ నిలుస్తుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా పోలీసు కన్వెన్షన్‌ హల్లో సోమవారం ‘మహిళా భద్రత- దిశ యాప్‌’ అంశంపై నిర్వహించిన మెగా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతే ప్రధాన ఆశయంగా ప్రభుత్వం, పోలీసుశాఖ పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, 3 అర్బన్‌ పోలీసు జిల్లాలు, 2 కమిషనరేట్‌లతో కలిపి 18 దిశ మహిళా పోలీసు స్టేషన్లను కేవలం మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఒక్కో పోలీస్‌ స్టేషన్లో డీఎస్పీ స్థాయి అధికారి, సీఐ, ఐదుగురు ఎస్‌ఐలతోపాటు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలు, బాలికల పట్ల జరిగే నేరాల సత్వర దర్యాప్తు కోసం ప్రతీ పోలీస్‌స్టేషన్‌కి ఒక వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. దిశ యాప్‌ని జిల్లాలో 3,44,015 మంది మహిళలు తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవడం జరిగిందన్నారు. ఈనెలాఖరుకి 5 లక్షల మహిళలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ లక్ష్యంగా పోలీసు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్‌ వెంటనే మహిళా రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. దిశ యాప్‌ని అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకుని రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌గా జిల్లాను నిలపాలని పిలుపునిచ్చారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేయర్‌ సుంకర పావని కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా దిశ చట్టం, దిశ యాప్‌ డౌన్‌లోడ్‌పై మహిళలు అడిగిన పలు సందేహాలను పోలీసు అధికారులు నివృత్తి చేసి డౌన్‌లోడ్‌ చేయించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ ఆర్‌.దీప్తిచంద్రకళ, బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పి.వెంకటలక్ష్మి, స్మార్ట్‌సిటీ చైర్మన్‌ అల్లి రాజబాబు, ఐసీడీఎస్‌ పీడీ జీవీ సత్యవాణి పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-27T06:43:53+05:30 IST