దిశ కేసులో ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాల విచారణ పూర్తి

ABN , First Publish Date - 2021-09-18T00:15:30+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్కౌంటర్ బాధిత

దిశ కేసులో ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాల విచారణ పూర్తి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాల విచారణ పూర్తి అయింది. బాధిత కుటుంబాల స్టేట్ మెంట్‌ను కమిషన్ నమోదు చేసుకుంది.  దిశ కేసులో తమ కొడుకులను పోలీసులు కావాలనే పట్టుకుని చంపారని కమిషన్‌కు చెప్పినట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. మాకు న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామని బాధిత కుటుంబాలు పేర్కొన్నాయి. వివిధ దఫాలుగా దిశ కమిషన్ విచారణ చేపట్టింది. మూడవ దశలో బాధిత కుటుంబాలను కమిషన్ ప్రశ్నించింది. ఇప్పటికే పలువు పోలీస్ ఉన్నతాధికారులను కమిషన్ విచారించింది. పలువురు సాక్ష్యులను, తహసీల్దార్ స్టేట్‌మెంట్‌ను కమిషన్ నమోదు చేసింది.

Updated Date - 2021-09-18T00:15:30+05:30 IST