‘‘దిశ’ పోలీసులు.. కావాలనే వేధిస్తున్నారు’’
ABN , First Publish Date - 2021-08-20T21:30:57+05:30 IST
గుంటూరు: అర్బన్ జిల్లా దిశ పోలీసులు కావాలనే వేధిస్తున్నారని బాపట్ల గిరిజన సంక్షేమ వార్డెన్ రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు: అర్బన్ జిల్లా దిశ పోలీసులు కావాలనే వేధిస్తున్నారని బాపట్ల గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్ రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం వారు మీడియాతో మట్లాడుతూ కేరళకు చెందిన ఓ మహిళ.. నగదు, నగలు తీసుకున్నాడని వార్డెన్ రాజుపై, రూరల్ జిల్లా బాపట్ల స్టేషన్లో ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఈ నెల 17వ తేదీన రాజును అదుపులోకి తీసుకున్నారన్నారు. నాలుగు రోజులుగా అర్బన్ జిల్లా దిశ పోలీస్స్టేషన్లో.. రాజును అక్రమంగా నిర్భందించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కనీసం రాజును తమకు చూపించకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.
ఫిర్యాదు చేసిన మహిళతో సెటిల్ చేసుకోవాలని దిశ పోలీసులు వత్తిడి పెడుతున్నారని రాజు మేనల్లుడు క్రాంతి కుమార్ ఆరోపించారు. రూరల్ జిల్లా స్టేషన్లో మహిళ ఫిర్యాదు చేస్తే.. ప్రస్తుతం రాజును అర్బన్ జిల్లా దిశ స్టేషన్లో ఉంచారని చెబుతున్నారు. ఆ కేసుకు, ఈ స్టేషన్కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాజు అనారోగ్యంతో ఉన్నారని.. వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.