జల్లికట్టులో అపశ్రుతి

ABN , First Publish Date - 2021-01-17T04:29:26+05:30 IST

చంద్రగిరి మండలంలోని మల్లయ్యపల్లె, దోర్నకంబాల, మండపంపల్లె, గంగుడుపల్లె గ్రామాల్లో శనివారం జల్లికట్టు నిర్వహించారు. అల్లెలో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించడానికి యువకులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

జల్లికట్టులో అపశ్రుతి
అల్లెలో పరుగు తీస్తున్న పశువులు

గంగుడుపల్లెలో ఆవు మృతి


చంద్రగిరి, జనవరి 16: చంద్రగిరి మండలంలోని మల్లయ్యపల్లె, దోర్నకంబాల, మండపంపల్లె, గంగుడుపల్లె గ్రామాల్లో శనివారం జల్లికట్టు నిర్వహించారు. అల్లెలో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించడానికి యువకులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గంగుడుపల్లెలో అయితే ఓ ఆవును యువకులు నిలువరించే క్రమంలో అది కింద పడింది. వెనుక వస్తుండిన పశువులు దాన్ని తొక్కేయడంతో అది అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఆవు గంగుడుపల్లెకు చెందిన పందికుంట నరిసింహారెడ్డికి చెందినదిగా గుర్తించారు. కాగా.. జల్లికట్టును తిలకించడానికి ఈగ్రామాలకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. దీనివల్ల ఈ ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. అనుప్పల్లె-చంద్రగిరి రోడ్డు మార్గం కొంతసేపు స్తంభించింది. సీఐ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రామకృష్ణ, చిన్నరెడ్డెప్పలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.



Updated Date - 2021-01-17T04:29:26+05:30 IST