మాజీ ఎంపీ లగడపాటి(Lagadapati)పై నమోదైన కేసు కొట్టివేత

ABN , First Publish Date - 2022-06-27T20:58:50+05:30 IST

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌‌పై ఈసీ నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.

మాజీ ఎంపీ లగడపాటి(Lagadapati)పై నమోదైన కేసు కొట్టివేత

విజయవాడ: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌‌(Lagadapati rajagopal)పై ఈసీ(EC) నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల  కోర్టు కొట్టివేసింది. 2014 ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి ముందుగానే అంచనాలను వెల్ల‌డించారంటూ అప్పటి ఎన్నికల కమిషనర్ భ‌న్వ‌ర్‌లాల్ కేసు న‌మోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు సాక్షులను కోర్టు విచారించింది. అలాగే వీడియో, ఆడియో రికార్డింగ్‌లను న్యాయస్థానం పరిశీలించింది. కాగా... సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్ల  ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 

Updated Date - 2022-06-27T20:58:50+05:30 IST