రూ.200 కోసం బంధువుల మధ్య గొడవ.. ఆ చిన్న గొడవ ఎంతటి ఘోరానికి దారి తీసిందంటే..

ABN , First Publish Date - 2022-01-04T22:36:21+05:30 IST

వారంతా బంధువులే.. పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తుంటారు.. ఎన్నో ఏళ్లుగా కలిసి మెలిసి ఉంటున్నారు.

రూ.200 కోసం బంధువుల మధ్య గొడవ.. ఆ చిన్న గొడవ ఎంతటి ఘోరానికి దారి తీసిందంటే..

వారంతా బంధువులే.. పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తుంటారు.. ఎన్నో ఏళ్లుగా కలిసి మెలిసి ఉంటున్నారు.. వారి మధ్య రూ.200 కారణంగా గొడవ మొదలైంది.. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది.. దాంతో ఒక వ్యక్తి మేనల్లుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


బిలాస్‌పూర్‌లోని ఓ బస్తీలో నివసిస్తున్న దరము బెనర్జీ అనే వ్యక్తి గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతడి నుంచి మేనల్లుడు నరేంద్ర జంగ్డే నూతన సంవత్సర వేడుకల కోసం రూ.200 అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగేందుకు ఈ రోజు (మంగళవారం) ఉదయం నరేంద్ర ఇంటికి దరము వెళ్లాడు. అయితే నరేంద్ర డబ్బులు లేవని చెప్పడంతో దరము ఆగ్రహానికి గురై తిట్టడం ప్రారంభించాడు. దీంతో నరేంద్ర సోదరుడు అజయ్, తండ్రి అవతారమ్ అక్కడకు వచ్చారు. 


ముగ్గురూ కలిసి దరముపై మాటల దాడి చేశారు. అనంతరం భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆ గొడవ క్రమక్రమంగా పెరగడంతో నరేంద్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి దరమును చంపేశాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నరేంద్ర, అవతారమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అజయ్ పరారు కావడంతో అతడి గురించి అన్వేషణ సాగిస్తున్నారు. 

Updated Date - 2022-01-04T22:36:21+05:30 IST