AP News: నిమజ్జనంలో అపశృతి - రెండు జిల్లాల్లో నలుగురి మృతి

ABN , First Publish Date - 2022-09-02T01:52:32+05:30 IST

పల్నాడు - విజయనగరం: వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశ‌ృతి చోటుచేసుకుంది. వేర్వేరు జిల్లాలో నిమజ్జనానికి వెళ్లి నలుగురు మృత్యువాతపడ్డారు. పల్నాడు జిల్లాలో వినాయక విగ్రహాలను అమరావతి దగ్గర కృష్ణ నదిలో నిమజ్జనం చేశారు. అక్కడ కృష్ణ నదిలో జారిపడి ఇద్దరు చనిపోయారు. మృతులను భార్గవ్, మల్లికార్జున్‌గా

AP News: నిమజ్జనంలో అపశృతి - రెండు జిల్లాల్లో నలుగురి మృతి

పల్నాడు - విజయనగరం:  వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశ‌ృతి చోటుచేసుకుంది. వేర్వేరు జిల్లాలో నిమజ్జనానికి వెళ్లి నలుగురు మృత్యువాతపడ్డారు. పల్నాడు జిల్లాలో వినాయక విగ్రహాలను అమరావతి దగ్గర కృష్ణ నదిలో నిమజ్జనం చేశారు. అక్కడ కృష్ణ నదిలో జారిపడి ఇద్దరు చనిపోయారు. మృతులను భార్గవ్, మల్లికార్జున్‌గా గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. పేరిపి గ్రామం దగ్గర తోటపల్లి కాలువలో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేస్తుండగా కాలువలో పడి ఇద్దరు పిల్లలు చనిపోయారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


Updated Date - 2022-09-02T01:52:32+05:30 IST