శివస్వాములకు అన్నప్రసాద వితరణ

ABN , First Publish Date - 2021-03-02T05:29:00+05:30 IST

మహా శివరాత్రిని పు రస్కరించుకొని శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములకు జిల్లా కేంద్రంలోని..

శివస్వాములకు అన్నప్రసాద వితరణ
శివస్వాములకు పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి దంపతులు

- ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి దంపతులు

కందనూలు, మార్చి 1 : మహా శివరాత్రిని పు రస్కరించుకొని శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములకు జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డుకాలనీ శ్రీలలితా సహస్రనామ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌ రెడ్డి దంపతులు అన్నప్రసాద వితరణ కార్యక్రమా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శివస్వాము లకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీ సీబీ డైరెక్టర్‌ జక్కారఘునందన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పనాభాస్కర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ బాబురావు, మునిసిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:29:00+05:30 IST