పాడి రైతులకు బోనస్ పంపిణీ
ABN , First Publish Date - 2022-01-26T05:04:13+05:30 IST
మండలంలోని అమృతపురం గ్రామంలో పాడి రైతులకు హెరిటేజ్ డెయిరీ ప్లాంట్ మేనేజర్ శెట్టి నానిబాబు మంగళవారం రూ.3 లక్షల నగదు బోనస్ పంపిణీ చేశారు.
సబ్బవరం, జనవరి 25: మండలంలోని అమృతపురం గ్రామంలో పాడి రైతులకు హెరిటేజ్ డెయిరీ ప్లాంట్ మేనేజర్ శెట్టి నానిబాబు మంగళవారం రూ.3 లక్షల నగదు బోనస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు హెరిటేజ్ సంస్థ అండగా ఉంటుందన్నారు. పాడి రైతుల సహజ మరణానికి రూ.50 వేలు, ప్రమాద బీమా కింది రూ.2 లక్షలు చెల్లించే ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డెయిరీ సిబ్బంది మాసవరపు శ్రీనివాసరావు, బైలపూడి సూర్యారావు, మురళీధరన్, పైడింనాయుడు, దేముడుబాబు, నారాయణ రావు, గోవింద, ఎర్రయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.