పాడి రైతులకు బోనస్‌ పంపిణీ

ABN , First Publish Date - 2022-01-26T05:04:13+05:30 IST

మండలంలోని అమృతపురం గ్రామంలో పాడి రైతులకు హెరిటేజ్‌ డెయిరీ ప్లాంట్‌ మేనేజర్‌ శెట్టి నానిబాబు మంగళవారం రూ.3 లక్షల నగదు బోనస్‌ పంపిణీ చేశారు.

పాడి రైతులకు బోనస్‌ పంపిణీ
అమృతపురంలో పాడి రైతుకు నగదు బోనస్‌ ఇస్తున్న హెరిటేజ్‌ ప్లాంట్‌ మేనేజర్‌ శెట్టి నానిబాబు

సబ్బవరం, జనవరి 25: మండలంలోని అమృతపురం గ్రామంలో పాడి రైతులకు హెరిటేజ్‌ డెయిరీ ప్లాంట్‌ మేనేజర్‌ శెట్టి నానిబాబు మంగళవారం రూ.3 లక్షల నగదు బోనస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు హెరిటేజ్‌ సంస్థ అండగా ఉంటుందన్నారు. పాడి రైతుల సహజ మరణానికి రూ.50 వేలు, ప్రమాద బీమా కింది రూ.2 లక్షలు చెల్లించే ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డెయిరీ సిబ్బంది మాసవరపు శ్రీనివాసరావు, బైలపూడి సూర్యారావు, మురళీధరన్‌, పైడింనాయుడు, దేముడుబాబు, నారాయణ రావు, గోవింద, ఎర్రయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:04:13+05:30 IST