ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ

ABN , First Publish Date - 2021-04-22T04:57:29+05:30 IST

ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా ఉపాధి హామీ అనుసంధానంతో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేయనున్నట్లు ప్రకృతి వ్యవసాయ సీఏ చంద్రశేఖర్‌, రాంమోహన్‌, వీరనాగయ్య తెలిపారు.

ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ

సుండుపల్లె, ఏప్రిల్‌ 21: ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా ఉపాధి హామీ అనుసంధానంతో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేయనున్నట్లు ప్రకృతి వ్యవసాయ సీఏ చంద్రశేఖర్‌, రాంమోహన్‌, వీరనాగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఐదెకరాలలోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఇంతవరకు మామిడి చెట్లు తీసుకోని వారికి ఐదు రకాల పండ్ల మొక్కలను ఉచితంగా అందజేయనున్నట్లు  తెలిపారు. ఉపాధి హామీలో జాబ్‌కార్డు ఉన్న వారికి ఈ అవకాశం కల్పించనున్నట్లు వారు తెలిపారు. ఆసక్తి గల రైతులు మండల కేంద్రంలో ఉన్న ప్రకృతి వ్యవసాయశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. 

Updated Date - 2021-04-22T04:57:29+05:30 IST